తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, మక్తల్ నవంబర్ 7న జరుగు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడి

 వనపర్తి జిల్లా: నవంబర్ 5 (జనం సాక్షి) కడుకుంట్ల గ్రామంలో నవంబర్ 7న మక్తల్ పట్టణంలో జరుగు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి .వనపర్తి మండల నాయకులు భరత్ సాగర్ పిలుపు మేరకు ఈరోజు వనపర్తి మండలం కడకుంట్ల గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీని, నిర్వహించడం జరిగింది. ఆ సంఘం మండల నాయకులు, బరసాగర్ ,జనరల్ బాడీ, సమావేశంలో మాట్లాడుతూ, నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పెండింగ్లో లేకుండా చూడాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని నిర్మాణ రంగ కార్మికులకు వృత్తిపరమైన సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని ప్రమాద మరణాన్ని 10 లక్షల పెంచాలని, సహజ మరణాన్ని ఐదు లక్షల పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో కార్మికులకు తప్పక పనులు కల్పించాలని కోరారు. మక్తల్ లో జరుగు రాష్ట్ర మహాసభలను మండలంలోని కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చన్న, మన్నెం, చిలక రవి తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ, అనంతరం గ్రామంలో పురవీధుల గుండా రాష్ట్ర మహాసభలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.