తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే..

ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నరు అనేది ఎన్నడూ చూడలేదు..అట్లాంటి పక్షపాతమే లేదు

ఏ రాజకీయ పార్టీలో ఉన్న మన తెలంగాణ బిడ్డలే కదా అంటడు కేసిఆర్

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతున్నది

రాష్ట్రంలో కేసిఆర్ గారి పాలన ఎంతో పారదర్శకంగా సాగుతోంది

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్:

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో 85 మందికి,పాలెం గ్రామంలో 95మందికి, ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో 31 మంది, తాళ్లరాంపూర్ 22 మందికి మొత్తం 233 మందికి ఇళ్ళ స్థలాలకు సంబందించిన పట్టాలు అందించారు.

ఈ సందర్బంగా జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ…

తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధు,రైతు భీమా,ఆసరా పెన్షన్లు,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే కళ్యాణ లక్ష్మి – 10వేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున, ఆసరా పెన్షన్లు 62వేల మందికి 2వేలు,4వేల చొప్పున, సీఎం రిలీఫ్ ఫండ్ 10వేల మందికి కేవలం ఈ మూడింటిలోనే దాదాపు
82వేల మందికి లబ్ది జరిగిందన్నారు. ఇందులో నాకు ఓటు వేసిన వారు ఎంత మంది వెయ్యని వారు ఎంత మంది అని నేను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నడూ కూడా ఏ పార్టీ అని చూడలేదు,కేసిఆర్ అందర్నీ సమానంగా చూస్తున్నారు. అందరూ తెలంగాణ బిడ్డలే కదా..ఇతర పార్టీలో ఉన్న కూడా వారికి మంచి చేసి మనసు గెలుచుకుందామని కేసిఆర్ మాకు చెప్తారని అన్నారు. పూర్తి పారర్శకతతో కేసిఆర్ పాలన సాగుతోందని చెప్పారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో అధికారులు తనిఖీ చేసి నిజమైన అర్హులను ఎంపిక చేశారని,ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కూడా వారు రికమెండేశన్లు చేయలేదు.అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని వారే సూచించారని ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. పట్టాలు అందుకున్న అందరికీ గృహ లక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ఆర్ధిక సహాయం అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు శుభాకంక్షలు తెలిపారు.

వాళ్ళు ఉన్నపుడు 200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 4వేల పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. 200రూపాయలు ఉన్న పెన్షన్లు 2000వేలు చేసింది కేసిఆర్ కాదా ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఒంటరి మహిళలు,బీడీ కార్మికులకు 2వేల పెన్షన్ ఇస్తున్నది కేసిఆర్ వచ్చిన తర్వాత మాత్రమే అని అన్నారు. ఎవరు ప్రజల మేలు కోరే వారు ఎవరు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నారో గమనించాలని అన్నారు. ఒక్క సారి ఓట్లు డబ్బల పడగానే మొహం చాటేస్తారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు గుర్తు బీజేపీ 4వందల గ్యాస్ సిలిండర్ 1200 చేశారు. డీజిల్,పెట్రోల్ ధరలు పెంచారు,దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు గోస పడుతున్నారనీ అన్నారు. బీజేపీ కేవలం దేశం పేరు,దేవుని పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుతోంది అని, మన ఇంటికి ఏం చేస్తారో చెప్పకుండా పనికి వచ్చే మాటలు చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాక ముందు దేవునికి మొక్కలేదా..? వాళ్లు చెప్తేనే ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నామా..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్,బీజేపీ మోసపు హామీలు,మాటలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు.
కేసిఆర్ వల్ల లబ్ది పొందిన వారు,లబ్ది పొందుతున్న వారు ఆలోచన చేయాలనీ మంచి చేస్తున్న కేసిఆర్ ను,తనను మళ్ళీ ఆశీర్వదించాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్,మోర్తాడ్ ఎంపిపి శివలింగు శ్రీనివాస్,మోర్తాడ్ జడ్పీటిసి బద్దం రవి, ఏర్గట్ల ఎంపిపి ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల జడ్పీటిసి రాజేశ్వర్,మోర్తాడ్ తహిసిల్దార్ సత్యనారాయణ, ఏర్గట్ల తహిసిల్డార్ ఆయా గ్రామాల సర్పంచ్ లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలీయా, పూర్ణానందం,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.