తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి

ఖమ్మం జిల్లా రఝునాధపాలెం 02 జనం సాక్షి తెలంగాణ బిల్లు ఆమోదం శివాయిగూడెం ఉదయనగర్ కాలనీ నందు ఖమ్మం జిల్లా మహిళ అధ్యక్షురాలు ధారావత్ స్వాతి బాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ ముఖ్యఅతిధిగా హాజరుఅయ్యారు వారితో పాటు రాష్ట్ర ఇంచార్జి గుగులోత్ రమేష్ నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మత్రు నాయక్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాన్సింగ్ నాయక్ పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా గిరిజిన రిజెర్వేషన్ 10 శాతం పెంచి గిరిజన లంబాడి ప్రజలకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం చేసారు అనంతరం ఖమ్మం జిల్లా లో కొంత మందికి సంగం లో బాధ్యతలను ఇస్తూ నియామక పత్రాలను అందజేశారు గ్రామా అధ్యక్షురాలిగా భూక్యా శారదబాయి,జిల్లా అధ్యక్షులుగా బానోత్ కిషన్ నాయక్, రఘనాధపాలెం మండల అధ్యక్షులుగా దశరద్ నాయక్,ప్రధాన కార్యదర్శిగా భూక్యా విజయ్ నాయక్,సహాయ కార్యదర్శిగా భూక్యా భద్రునాయక్,కార్యదర్శిగా తేజావత్ వీరబాబు ని నియమించారు కార్యక్రమంలో దారావత్ సైదులు,డుంగ్రోత్ శంకర్,నాగమ్మ,సామ్రాజ్యం,
లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.