త్వరలోనే ఈ పాస్‌పోర్టు వస్తోంది

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ`పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి
జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్‌ పక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ`పాస్‌పోర్ట్‌ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడిరచారు. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్‌ కరెన్సీని విడుదల చేస్తుందన్నారు. వజ్రాలపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. కట్‌ అండ్‌ ్గªన్‌ డైమండ్స్‌పై కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు.