త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

2

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి):త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. టెట్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశాం, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతుందని తెలిపారు. విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యంచేశాయని గుర్తు చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరనున్నాయి. త్వరలోనే డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని చెప్పారు. మే 1న టెట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయని కడియం అన్నారు. త్వరలోనే విద్యావ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.