త్వరలో నగదు కొరత తీరుతుంది

arun-jaitley3-05-1470387544పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత డిసెంబర్ 30 నాటికి తీరుతుందని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రోజిక్కడ మాట్లాడిన ఆయన అయితే నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న నగదు మొత్తంతో కొత్త కరెన్సీ సమానంగా ఉండదని పేర్కొన్నారు. దేశంలో నల్లధనం, అవినీతిని అరికట్టడానికి తాము తీసుకునే చర్యలలో పెద్ద నోట్ల రద్దు తొలి అడుగు మాత్రమేనని, ఇది ఆరంభమేనని పేర్కొన్నారు.