త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు

 త్వరలో రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా జరగవచ్చ2000-new-note-clear-imagesన్నారు. రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చెలామణిలో ఉంటుందని గురుమూర్తి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్‌నాటికే ఈ రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి తొలగిస్తారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు మీడియా సంస్థలు దీనికి సంబంధించి వార్తా కథనాలు కూడా ప్రచురించాయి. మరోవైపు ఇప్పటికే వెయ్యి రూపాయల నోటు కొత్త రూపంలో రానున్నట్లు సోషల్ మీడియాలో నమూనా నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలు కీలకంగా మారాయి.