థానే ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయని పోలీసులు

ముంబయి: థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో బిల్డర్లు సలీల్‌. ఖలీల్‌ మదార్‌పై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరిని అరెస్టు చేయలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 67 మంది మృతి చెందారు.పలువురి క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.