థానే ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

ముంబయి : థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సహాయ మున్సీపల్‌ కమిషనర్‌, ఎన్సీపీ కార్పొరేటర్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిన్న ఇద్దరు బిల్డర్లతోపాటు సస్పెండ్‌కు గురైన డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 74 మంది మృతి చెందగా పలువురు క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.