థానే ప్రమాదంలో 38 కి చేరిన మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని మరణిచిన 38 మంది మృతుదేహాలను వెలికితీశారు. 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద ఉన్నారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.