దంతెవాడ ఘటనలో మరో కానిస్టేబుల్‌ మృతి

 

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): దంతేవాడలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో గాయపడిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేశ్‌ కౌశల్‌ చికిత్స పొందుతూబుధవారం మృతిచెందారు. దీంతో దంతేవాడ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దంతేవాడ జిల్లాలో ఎన్నికల పక్రియను కవర్‌ చేసేందుకు వెళ్లిన దూరదర్శన్‌ బృందంపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దూరదర్శన్‌ కెమేరామ్యాన్‌తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నీలవాయ గ్రామం సవిూపంలోని అరాన్‌పూర్‌ అడవుల్లో మంగళవారం ఉదయం 11గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడంలో భాగంగానే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని నక్సల్స్‌ వ్యతిరేక ప్రత్యేక ఐజీ డీఎం అవస్తి పేర్కొన్నారు.