దసరా, జమ్మి వేడుకలు ఫారెస్ట్ గ్రౌండ్ లోనే జరగాలి

దసరా, జమ్మి వేడుకలు ఫారెస్ట్ గ్రౌండ్ లోనే జరగాలి

ఇల్లందు అక్టోబర్ 12 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణములో 2023 దసరా ఉత్సవాలు ఖచ్చితంగా నూరుకు నూరు శాతం జమ్మి గ్రౌండ్ మరియు ఫారెస్ట్ గ్రౌండ్ లో జరగాల్సిందే జరిపిస్తామని దసరా ఉత్సవాల నిర్వహణ కమిటీ ఇల్లందు అధ్యక్షులు పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఖంట పదముతో చెబుతున్నారు.అనాది కాలంగా చేసుకుంటూ వస్తున్న జమ్మి పూజ లు శావలు జమ్మి గ్రౌండ్ లో మరియు రావణ వధ,బాణా సంచా కార్యక్రమాలు ఫారెస్ట్ గ్రౌండ్ లో జరుపుకునే విధంగా అనుమతి కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్ కి రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ కి రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి రాష్ట్ర రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కి పట్టణ శాసన సభ సభ్యురాలు బానోత్ హారిప్రియ నాయక్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.