దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాంరంబించాలి*

*రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి*
రామన్నపేట అక్టోబర్ 14 (జనంసాక్షి) దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. రామన్నపేటలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం గన్నెబోయిన విజయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ వరికోతలు ప్రారంభమయ్యి 15 రోజులు గడుస్తున్నా మార్కెట్లల్లో దాన్యం రాసులు పోసి రైతులు పడిగాపులు కాస్తున్నా, ఇప్పటికీ కొనుగోలు ప్రారంభించకపోవడంతో వాతావరణం సహకరించక వర్షాలు పడి దాన్యం తీవ్రంగా ప్రతీ సంవత్సరం నష్టపోవాల్సివస్తుందన్నారు. అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం స్పందించి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో రైతు సంఘం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బొయిని ఆనంద్, నాయకులు జల్లెల పెంటయ్య,బొడ్డుపల్లి వెంకటేశం,కందుల హనుమంతు,బల్గూరి అంజయ్య,బావండ్లపల్లి బాలరాజు,యం.డి రషీద్,పెండెం బ్రహ్మయ్య,మూషం నరహారి,అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area