దిల్లీలో కూలిన బీఎస్‌ఎఫ్‌ విమానం

999నలుగురు జవాన్ల మృతి

 

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే దక్షిణ ఢిల్లీ సమీపంలో ద్వారక వద్ద కుప్పకూలింది. ఈఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు జవాన్లు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.