దిల్లీలో భవనం కూలి వ్యక్తి మృతి

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50)  అనే కార్మికుడు  దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో  ఐదుగురు గాయపడ్డారు. బేస్మెంట్ నుంచి మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.