దిల్లీ, ముంబయిలలో వొడాఫోన్‌ 4జీ సేవలు

దిల్లీ:  ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ వచ్చే మార్చికల్లా మెట్రోసిటీలైన దిల్లీ, ముంబయిలలో 4జీ సేవలను విస్తరించనుంది. ఇప్పటికే ఈ టెలికాం ఆపరేటర్‌ కేరళలో ఉన్న తమ వినియోగదారులకు 4జీ సేవలను అందిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా ముంబయి,  బెంగళూరు, కోల్‌కతా నగరాలలోని వొడాఫోన్‌ వినియోగదారులకు కూడా ఈ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించే యోచనలో ఉంది. మార్చి నెల నాటికి దిల్లీ, ముంబయిలకు సేవలను విస్తరిస్తామని కంపెనీ ఈరోజు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ముంబయిలో వొడాఫోన్‌ 4జీ సిమ్‌ల అమ్మకాలు చేపడుతున్నారు. ఈ సిమ్‌లను హోమ్‌డెలివరీ విధానం ద్వారా కూడా వినియోగదారులకు ఇచ్చే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది.