*దివ్యాంగుల మండల అధ్యక్షుడిగా:ముత్తునూరి మహేష్*

ధర్మపురి నవంబర్ 4 (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఉదయం న్యూ టీటీడీ హాల్లో జిల్లా అధ్యక్షునీ సూచన మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు
మరియు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వీరి సమక్షంలో ధర్మపురి పట్టణంలో దివ్యాంగుల మండల అధ్యక్షుడిగా
ఏకగ్రీవంగా ముత్తునూరి మహేష్, ను ఉప అధ్యక్షుడిగా ఆవునూరి గంగారాము,ను ఎన్నుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు జనం సాక్షి మీడియాకు తెలిపారు.తనంతరం
ధర్మపురి నూతన అధ్యక్షుడు ముత్తునూరి మహేష్ మాట్లాడుతూ,వివిధ మండలాల నుండి వచ్చినటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చారంటూ, వికలాంగుల హక్కుల కోసం, ప్రభుత్వ పథకాలను వికలాంగులకు చేరేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సత్యనారాయణ, బెదిగం రాజు, నులికొండ భాస్కర్, దేవీ నాగేందర్, బండమీది నరేష్ మరియు సోదరి సోదరమణులు తదితరులు పాల్గొన్నారు.