దీపావళి రోజు విద్యుత్ దీపాల ఏర్పాటు చాలా ఆనందం.

వెల్టూరు గ్రామ ప్రజలు.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 24 అక్టోబర్ 2022
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట ,నియోజకవర్గం ఉప్పునుంతల ,మండల పరిధిలోని  వెల్టూరు, గ్రామపంచాయతీలో, ఐమాక్స్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, గ్రామ ప్రజలు నాయకులు అన్నారు. అడిగిన వెంటనే తనకు గ్రామం పై ఉన్న ప్రేమతో ఎంపీ నిధులచే, మూడు లైట్లకుగాను ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎంపీ పోతుగంటి రాములు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ రంగారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కురుమయ్య, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్, పార్టీ సీనియర్ నాయకులు పద్మనాభ రెడ్డి, లింగమయ్య, శ్రీనివాస్, జంగయ్య, మల్లయ్య, రమేష్, సర్వేష్, జానయ్య, జంగయ్య, సైదులు, బాలస్వామి, లింగారెడ్డి, జనార్దన్ రెడ్డి, నీలి పాషా, శేఖర్ , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area