దుర్గ మాత బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నవంబర్ 11 (జనం సాక్షి) కొహిర్ మండలం లోని కోత్తుర్( డి ) గ్రామం లో శుక్రవారం దుర్గ మాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ని మహిళలు బారి ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పాల్గొని దుర్గామాత ఆలయంలో పూజలు చేశారు. ఆయనకు ఆలయ గ్రామ పెద్దలు ఆలయ నిర్వహకులు శాలువతో సన్మానించారు.ఈ
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్, ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, నాయకులు రత్నం, రాజు, నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు