దూసుకెళుతున్న స్టాక్‌ మార్కెట్లు


4
ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడి 25539 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 7829 వద్దకు చేరింది. దీనికి తోడు ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. వర్షపాతం సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటుందన్న వాతావరణ శాఖ అంచానాలు.. భారతీయ వృద్ధి రేటు బాగుంటుందన్న ఐఎంఎఫ్‌ నివేదికలు మధుపరుల్లో అంచనాలను పెంచాయి. మార్కెట్లోని అన్ని సెక్టార్లు లాభాల బాటపట్టడం సెంటిమెంట్‌ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.