దెబ్బతిన్న  రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం,మార్చి27(జ‌నంసాక్షి): సకాలంలో వర్షాలు కురవక ముందస్తు వర్షాలకు విత్తుకున్న రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తెలిపారు. వర్షాలు కురవకపోతే ఈ పంట కూడా చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. గతంలో జిల్లాలోని రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికి చాలామందికి  ఇవ్వలేదన్నారు. జిల్లాలో లక్ష ఫారంపాండ్‌ గుంతలను తీసి వాటిలో నిల్వఉన్న వర్షపునీటిని రెయిన్‌ గన్ల ద్వారా పంటరక్ష తడులు ఇస్తామని జిల్లా అధికారులు ఊకదపుండు ఉపన్యాసాలు ఇచ్చారని, వాస్తవంలో అవి ఏమాత్రమూ ఉపయోగపడలేదన్నారు. వరుస కరువులతో భవిషత్తును దృష్టిలో ఉంచుకుని రైతులు సాగుచేసి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.  రెయిన్‌గన్ల పంపిణీకి కోట్లు ఖర్చు చేసిన జిల్లా కలెక్టర్‌ అవి రైతులకు ఎంత వరకు ఉపయోగపడ్డాయో తెలుపాలని ప్రశ్నించారు.