నట్టల నివారణ కార్యక్రమం విజయవంతం ….మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ పానుగల్ ,జూన్ 08( జనం సాక్షి) 

మండలంలోని దావాజిపల్లి,మరియు దొండపల్లి గ్రామాలలో
గొర్రెలు మరియు మేకలకు  ఉచిత సామూహిక నట్టాల నివారణా కార్యక్రమం విజయవంతం అయినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7423 గొర్రెలకు,440 మేకలకు నట్టల మందులు వేయటం జరిగిందని తెలిపారు.
 ఈ కార్యక్రమములో మండల పశు వైద్యుడు శ్యామ్, జిల్లా గొర్రెల  యూనియన్ డైరెక్టర్ తిరుమల్ యాదవ్,ఆయా గ్రామాలా  సర్పంచులు వెంకటయ్య యాదవ్,శ్యామలమ్మ సుధాకర్ రెడ్డి,గొర్రెల సంఘం అధ్యక్షులు కృష్ణయ్య యాదవ్ గ్రామస్థులు  పశువైద్య సిబ్బంది సత్యనారాయణ, బాలేశ్వర, ఖుర్షీద్ అలీ, బుచ్చన్న బుచ్చనన్, చంద్రయ్య, శివశివశంకర్ పాల్గోనటంజరిగింది.