నల్గొండలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి, భువనగిరి మధ్యరాకపోకలకు అంతరాయం కలిగింది.