నల్లకుబేరులకు చివరి అవకాశం
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నల్లకుబేరులకు చివరి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ వారంలోనే దీనిపై ఒక నోటిఫికేషన్ వస్తుందని సమా చారం. బ్యాంకుల్లో జమ చెెసిన రద్దైన నోట్లపై 50 శాతం పన్ను చెల్లించి పునీతులు కండని ప్రభుత్వం కోరే అవకాశాలు న్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనా (పీఎంజీ కెవై) కింద ప్రస్తుతం బ్యాంకు లో డిపాజిట్ చేసిన మొత్తంపై 50 పన్నులు సర్చార్జీ చెల్లించి.. మొగి లిన మొత్తంలో నాలు గోవంతు బ్యాంకులో నాలుగు సంవత్సరాల పాటు డిపాజిట్ చేయా ల్సి ఉంటుంది. దానిపై ఎలాంటి వడ్డీ లభించ దు. ఈ వారంతం లో రెవెన్యూ శాఖ పీఎం జీ కెవై 2016 ను ప్రకటన చేస్తుంది. పన్ను సవరణ చట్టం 2016ను లోక సభలో ప్రభు త్వం గత నెల 29న ఆమోదించింది. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫి కేషన్ లో వివరా లు ఎలా తెలి య జేయా లో ఒక (ఫార్మాట్) విడుదల చేస్తుంది. దాని ప్రకారం పన్నులు ఎంత మొత్తంలో చెల్లించాలి… వాయి దాలు.. పీఎంజీకెవై స్కీం ఎప్పడు ముగుస్తుంది తదితర అంశాలు ఉంటాయని అధికా రులు తెలియజేశారు. ఆదా యపు పన్ను చట్టం సవరణ బిల్లు దీన్నే ద్రవ్యబిల్లు 2016ను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనికి పార్లమెంటులోని ఎగువైసభ అనుమతి అక్కర్లేదు. చట్ట ప్రకారం ద్రవ్యబిల్లును రాజ్యసభ 14 రోజులు ఆమోదించి లోక్సభకు పంపాల్సి ఉంటుంది. కాగా ఈ 14 రోజుల సమయం డిసెంబర్ 14తో ముగుస్తుంది. అటు తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపిస్తారు. అటు తర్వాత ఈ వారంలోనే దీని ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వవర్గాలు తెలియజేశాయి.