నల్లకుబేరుల నుంచి రక్షించడానికే
పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటి వరకూ 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకే తాను పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటోన్న నల్లకుబేరుల నుంచి రక్షించడానికే తాను నోట్ల రద్దు చేపట్టానన్నారు. నోట్ల రద్దుతో పది రోజుల్లోనే పాత పన్నులన్నింటినీ జనం కట్టేశారని చెప్పారు. పది రోజుల్లో మున్సిపాలిటీలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు.