నవీళ్ళ రజిత అనారోగ్యంతో మృతి.

జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నవీళ్ల రజిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మృతురాలు నవీల్ల రజిత ఆమె భర్త యాకయ్య లు ఇద్దరు వికలాంగులు.బార్య చనిపోవడంతో భర్త యాకయ్య పరిస్తితి తెలుసుకున్న గ్రామ పెద్దలు – దాతల సహకారంతో వాట్స్అప్ గ్రూప్ సభ్యులు 22,500 వేలు రూపాయలను సేకరించి యాకయ్య కు అందించారు. అనంతరం ప్రభుత్వ ఉపాద్యాయుడు – గ్రూప్ అడ్మిన్ పులి దేవేందర్ మాట్లాడుతూ.. ఈ డబ్బులను బ్యాంకు లో లేదా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి,వారి ఆరోగ్య రీత్యా ఉపయోగించాలని సూచించడం జరిగింది. గ్రామస్తులకు విద్య, ఉద్యోగం లో రాణించడానికి గ్రూప్ సభ్యులు సహకారం గొప్పగా ఉందని, ఇలాంటి కార్యక్రమంలో సహకరిస్తూ ఆర్ధిక సహాయం చేస్తున్న గ్రామస్తులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మృతురాలి భర్త యాకయ్య మాట్లాడుతూ ఈ ఆర్థిక సహకారం అందించిన పెద్దలు అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,విద్యావంతులు అందె వెంకటేశ్వర్లు, బొమ్మెర సతీష్,వట్టే రవికిరణ్, రుద్రు రాజు,మొగిలి,స్వామి,బాల కృష్ణ, మాడుగుల కుమారస్వామి,బాబు, ఊడుగుల శ్రీనివాస్, మహమ్మద్ షరీఫ్,విజేందర్,కటుకూరి రాజు లతో పాటు కుటుంబ సభ్యులు మాంకాలి పూలమ్మ, లక్ష్మి,సాంబయ్య లు పాల్గొన్నారు.

తాజావార్తలు