నాటు సారా పావురాలపై దాడి

రామారెడ్డి   అక్టోబర్ 14 ( జనంసాక్షి )  :
నాటు సారా పావురాలపై దాడులు నిర్వహిచినట్లు ఎక్సైజ్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,  కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ ,  ఎక్సైజ్ అధికారి  రవీందర్,
రాజు , ఆదేశాల ప్రకారం రామారెడ్డి మండలం అన్నారం తండా, జగదాంబ తండా గ్రామ శివారు లో కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించామని అన్నారు.   అన్నారం తాండా శివారులోని పంట పొలాల్లోని పాత గుడిసెలో సోదాలు చేయగా ఒక గుడిసెలో 150 లీటర్ల విప్ప పువ్వు, పానకం, 5 లీటర్ల నాటుసారా , మరొక గుడిసెలో 150 లీటర్ల విప్ప పువ్వు పానకం , 3 లీటర్ల నాటుసారా మొత్తం 300 నాటు సార లీటర్ల విప్ప పువ్వు పానకం , 8 లీటర్ల నాటు సారా లభించిందన్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని అక్కడికక్కడే. సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితులను త్వరలో పట్టుకుని  కఠినమైన శిక్ష విధిస్తామ న్నారు.  ఈకార్యక్రమంలో విక్రమ్ ,  J. భాస్కర్, సంతోష్ రాథోడ్, SK. పాషా, G.రమేష్, ఆంజనేయులు, రమ తదితరులు పాల్గోన్నారు,
Attachments area