నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం

` గొలుసుకుట్టు చెరువులను రక్షిస్తాం
` చెరువు అడుగుల్లో భూములు కొనొద్దు
` హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరిక
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశలవారీగా హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని తెలిపారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు కలిపి 400కు పైగా ఉన్నాయన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని చెరువులు 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని అడ్డుకోకపోతే హైదరాబాద్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని వివరించారు.’’హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటవుతుంది. 2,500 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉంది. గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తాం. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయి. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమథనం చేస్తాం. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తాం. నందగిరి హిల్స్‌ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదు. చందానగర్‌లో గతేడాది బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తాం’’ అని రంగనాథ్‌ తెలిపారు. గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని, అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని, చెరువు ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. సోమవారం రంగనాథ్‌ విూడియాతో మాట్లాడారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తామని, పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని, పార్కు స్థలాల్లో ఫెన్సింగ్‌ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నామని, బస్తీ వాసుల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలని, నందగిరి హిల్స్‌ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని, చందానగర్‌లో గతేడాది బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని రంగనాథ్‌ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని, బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని హెచ్చరించారు త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని, హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఉంటుందని, ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. 2500 చదరపు కిలో విూటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధిలో ఉందని, దశల వారీగా హైడ్రా పని చేస్తుందని తెలియజేశారు. తొలి దశలో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని అని, రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని, మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునర్జీవనం కల్పించడం జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు.