నితీశ్ కుమార్పై మోడీ విమర్శల వర్షం
బీహార్ సీఎం నితీశ్ కుమార్పై ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు. తనపై ఆరోపణలు చేయలేక.. సొంత రాష్ట్ర ప్రజలపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు. బీహార్లో జరగనున్న నాలుగో దశ ఎన్నికల కోసం గోపాల్గంజ్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. మహాకూటమి నేతలు అన్ని స్థాయిల్లోనూ రాష్ట్ర మర్యాదను మంటగలిపారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, మహాకూటమి నేతల అత్యంత దిగజారుడు భాషను వాడుతున్నారని మోదీ అన్నారు. బీహార్ యువత వలస వెళ్లకుండా ఉండేందుకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలో అవినీతి అంతం చేస్తానని, తనపై నమ్మకం ఉంటాలని ఆయన కోరారు. బీహార్లో చోటుచేసుకున్న కుంభకోణాలను మోదీ సభలో చదివి వినిపించారు.