నితీష్ను గెలిపించండి – కేజ్రీవాల్
దిల్లీ,అక్టోబర్27(జనంసాక్షి): ఆప్ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిహార్ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను గెలిపించాలని, తిరిగి ఆయనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు అయిదు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్కు మద్దతుగా ఓట్లు వేయాలని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా బిహార్ ప్రజలను కోరారు. బిహార్ ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్ మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థి అయిన నితీశ్కుమార్కు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జేడీయూ తరఫÛన బిహార్లో ప్రచారం మాత్రం చేయలేదు. బిహార్లో భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లతో ఏర్పాటైన మహాకూటమికి మధ్య గట్టి పోటీ నడుస్తోంది.