నిరంతర విద్యుత్ ఇస్తున్నందుకు నా అభినందనలు

135077హైదరాబాద్: గ్రామాల్లో, పట్టణాల్లో నిరంతరం విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశంసించారు. దేశంలో విద్యుత్ మిగులు వచ్చిందని, తెలంగాణలో, దేశంలో పీక్ డిమాండ్‌లో కూడా పవర్ షార్టేజ్ జీరోగా ఉందని వివరించారు. 

అసెంబ్లీలో శనివారం లఘుచర్చలో భాగం కిషన్‌రెడ్డి మాట్లాడారు. రెండేండ్లలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని, ఈ సంవత్సరం పెరుగవచ్చని చెప్పారు. వన్ నేషన్, వన్ గ్రిడ్, వన్ ప్రైస్ నినాదంతో కేంద్ర పనిచేస్తున్నదని, ఉదయ్ స్కీంలో చేరడం వల్ల రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల ప్రయోజనాలు అందిస్తామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ప్రజలపై భారాలు వేయకుండా, విద్యుత్ నష్టాలు పూడ్చాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యమం సమయంలో మనందరమూ కలిసి పనిచేశామని చెప్పారు