నిరాహార దీక్షలు చేస్తున్న ఆశ కార్యకర్తలు

జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలో ఆశ వర్కర్ల 13వ రోజుకు చేరుకుంది. 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాములమ్మ, రాణి, సబిత, చంద్రకళ, కవిత, నవనీత, నాగమణి. గీత. లక్ష్మి. నాశమ్మా. రమ్యా. సంశీల. లాలీత. B. కవిత విజయ తదితరులు పాల్గొన్నారు