నిరుపేద రిక్షా కార్మికుడికి మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ చేయూత

 మోత్కూర్ ,అక్టోబర్ 18 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రానికి చెందిన నిరుపేద రిక్షా కార్మికుడు ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందగా ఆ నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సాప్ గ్రూపు అండగా నిలిచి ఆదుకుంది .గ్రూప్ సభ్యులు, దాతలు ఆర్థిక సహకారంతో అందించిన రూ. 42,250 నగదును మంగళవారం ఆ కార్మికుడి కుటుంబ సభ్యులకు శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్ గుండగోని రామచంద్రు గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గనగాని నరసింహ ల చేతుల మీదుగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు వాట్సప్ గ్రూప్ అండగా నిలవడం అభినందనీయమని ,గ్రూప్ సేవలను కొనియాడారు. మున్ముందు నిరుపేదలకు మరిన్ని సామాజిక సేవలు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు దబ్బేటి సోంబాబు, గంధం శ్రీనివాసరావు, కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎండి షాకీర్,జానీ,కోమటి మచ్చగిరి, బుర్ర శ్రీనివాస్ ,మర్రి అనిల్ కుమార్ ,ఆనందం,తమ్మినేని శ్రీనివాస్ రావు,చల్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.