‘నిర్భయ’ కేసులో దోషి, మరికొంత కాలం అబ్జర్వేషన్ హోం లోనే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషి, ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉంటున్న వ్యక్తి ని మరికొంత కాలం పాటు అక్కడే కొనసాగించాలంటూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది. 2012 డిసెంబరు 16న ఓ పారా మెడికల్ విద్యార్థిని(23)ని దారుణంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తుల్లో తను కూడా ఉన్నాడు. అతడి విడుదల అనంతరం పునరావాస కార్యక్రమానికి సంబంధించిన కొన్ని కోణాలపై స్పష్టత లేదనీ.. అందుకే, అతడిని అబ్జర్వేషన్ హోమ్లోనే కొనసాగించాలనీ కేంద్రం కోర్టుకు విన్నవించింది.