నిలకడగా ఉన్న బాలిక ఆరోగ్యం

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బాలిక ఐసీయూలో లేదని అయితే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ అనేక ప్రజాసంఘాలు నగరంలో ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు బీహార్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.