నిలకడగా సుష్మా స్వరాజ్ ఆరోగ్యం
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఈ రోజు ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఎయిమ్స్ లో నిన్న కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 64 ఏళ్ల సుష్మా స్వరాజ్ కు నిన్న ఎయిమ్స్ లో దాదాపు ఆరు గంటల పాటు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే.