నేటి నుంచి రష్యాలో షిండే పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై రష్యా మంత్రులతో ఆయన చర్చించనున్నారు.