నేడు కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు. గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరనున్నారు. నిన్న కేంద్ర మంత్రి వీరప్పమొయిలీని సీఎం కలిసి రాష్ట్ర విద్యుత్‌ సంక్షోభాన్ని వివరించారు. విద్యుత్‌ ప్రజెక్టులకు గ్యాస్‌ కేటాయింపుల అవసరాన్ని వివరించారు.