నేడు ఢిల్లీకి వెళ్లనున్న బొత్స
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకోన్న రాజకీయ పరిస్థితులపై హస్తిన పెద్దలకు వివరించేందుకు ఇవాళ సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో రాష్ట్రంలో నెలకోన్న రాజకీయాలపై చర్చించేందుకు బొత్సను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు పిలిచినట్టు సమాచారం.