నేడు మెగా లోక్ అదాలత్
కొత్తగూడెం,సెప్టెంబర్13 (జనంసాక్షి): లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ శనివారం మెగా లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. కొత్తగూడెం కోర్టుల భవన సముదాయంలో వీటిని నిర్వహిస్తారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసుల వివరాలు సంబంధిత పోలీస్స్టేషన్ వారీగా సవిూక్షించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో సహా మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, మోటార్ ప్రమాద బాధితుల కేసులు, సివిల్ కేసులు, బ్యాంకులకు సంబంధించిన ప్రీ లిటిగేషన్ కేసులు ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.