ఆగ్రా, దిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శుక్రవారం 91వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… వాజ్పేయీ నివాసానికి వెళ్లి, ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ… శుక్రవారం స్వదేశానికి రాగానే విమానాశ్రయం నుంచి నేరుగా వాజ్పేయీ ఇంటికి వెళ్తారని సమాచారం. మరోవైపు, వాజ్పేయీ సేవలకు గుర్తింపుగా, 91వ జన్మదినాన్ని పురస్కరించుకొని… ఆయన పూర్వీకుల గ్రామం బటేశ్వర్కు రైల్వేశాఖ సేవలను ప్రారంభించింది. రైల్వే సహాయమంత్రి మనోజ్ సిన్హా, మానవ వనరులశాఖ సహాయమంత్రి-స్థానిక ఆగ్రా ఎంపీ రామ్శంకర్ కతేరియా బటేశ్వర్కు ప్రయాణికుల రవాణా రైలు సేవలను గురువారం జెండా వూపి ప్రారంభించారు.