నేతల బొమ్మలతో రాఖీల అమ్మకాలు

అహ్మదాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాఖీ పండుగ సంబరాలకు దేశం యావత్తూ సిద్దం అయ్యింది. ఆదివారం జరిగే పండగ సందర్భంగా రకరకాల రాఖృలు వచ్చాయి. డైమండ్‌ సిటీ సూరత్‌లో.. స్వర్ణ పూతతో ఖరీదైన రాఖీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, విజయ్‌ రూపానీ బొమ్మలు ఉన్న స్వర్ణ రాఖీలను వజ్రాల వ్యాపారి మిలన్‌ తయారు చేశారు. 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ రాఖీలు శరవేగంగా అమ్ముడుపోతున్నాయి. మొత్తం 50 రాఖీలు చేయగా, ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయి. మరిన్ని రాఖీలు కావాలంటూ డిమాండ్లు కూడా వస్తున్నాయి. బంగారంతో చేసిన రాఖీలను రూ.50వేలు, రూ70 వేలకు అమ్ముతున్నారు. కస్టమర్లు కూడా ఆసక్తిగా ఆ రాఖీలను కొంటున్నారు. మరోవైపు మరింత ఖరీదైన రాఖీలకు డిమాండ్‌ ఏర్పడింది.