నేతాజీ దస్త్రాలను బహిర్గతం చేసిన ప్రధాని మోదీ
నేతాజీ జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను డిజిటల్ ప్రతుల రూపంలో బహిర్గతం చేశారు. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. 70ఏళ్ల క్రితం బోస్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన గురించి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్లు ఆయన తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపాయి. కానీ ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం కోసం దస్త్రాలను బహిర్గతం చేయాలని అడిగారు.