నేను ఏ పాపం చేయలేదు!

మధ్యప్రదేశ్‌ ప్రతిష్ఠను కాంగ్రెస్‌ దిగజారుస్తోందని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థప్రయోజనాల కోసం వ్యాపం స్కాం వ్యవహారంలో అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయస్థాయిలో దిగజారుస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాపం స్కాంలో తాను ఎలాంటి తప్పూ చేయలేద న్నారు. అవకతవకలు తన దృష్టికి రాగానే విచారణకు ఆదేశించానని తెలిపారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయన్న నమ్మకం తనకుందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అందుకే మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. కాగా, వ్యాపం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎంబీబీఎస్‌ విద్యార్థిని నమ్రతా దామర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులను విచారించాలని సీబీఐ నిర్ణయించింది.