నేరుగా మద్యం అమ్మకాలపై దృష్టి

భారీగా ధరలు పెరుగుతాయన్న ఆందోళన
గుంటూరు,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క మద్యం నియంత్రి స్తామంటూనే మరో పక్క
ధరలను విపరీ తంగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చీప్‌ లిక్కర్‌ నుంచి హై క్లాస్‌ బ్రాండ్‌ వరకు ఆల్‌
ప్రీమియం బ్రాండ్స్‌ ధరలు అక్టోబర్‌ నుంచి మోతమోగనున్నాయి. అక్టోబర్‌ నుంచి ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి మద్యం దుకాణాలను నిర్వహించనుంది. అందుకోసం విధివిధానాలను ఖరారు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.  ఉన్నతాధికారులు కేరళ, తమిళనాడు తరహాలో ఒక పాలసీని, అచ్చంగా ప్రభుత్వ మే మద్యం అమ్మకాలు చేపడితే ఉండే విధంగా మరోపాలసీని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం జిల్లాలో 20శాతం మద్యం షాపులకు కోత విధించనున్నారు. మద్యం ధరల ఎమ్మార్పీని భారీగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఐఎంఎల్‌ డిపో ద్వారా అందిస్తున్న ప్రతి బ్రాండ్‌ మద్యానికి క్వార్టర్‌కు కనీసం రూ.50కి పైనే పెంచనున్నారు. అన్ని ప్రీమియం బ్రాండ్లతో పాటు చీప్‌ లిక్కర్‌ ధర కూడా భారీగా పెరగనుంది. జిల్లాలో ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా నెలకు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తోంది. అక్టోబర్‌ నుంచి మరో రూ. 6 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే బార్‌లకు మాత్రం 2022 మార్చి 31 వరకు ఎటువంటి మార్పు ఉండదు. ఆ తరువాతే వాటిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు వైన్‌షాపులలో మద్యం రేట్లను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలో మద్యంషాపులు తగ్గించడంతో, మద్యం రేట్లు పెంచడంతో కాపుసారా, గుడుంబా వంటి పల్నాడు, డెల్టా ప్రాంతాల నుంచి భారీగా సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్‌శాఖ అధికారులు వీటి నియంత్రణ కోసం పని చేయాల్సి ఉంటుంది. జిల్లాలో వెయ్యి మందికిపైగా మద్యం షాపుల నిర్వహణ ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి షాపులో ముగ్గురు
నలుగురు చొప్పున ఉద్యోగాలు కల్పిస్తునున్నారు. వీరితో పాటు ప్రతి షాపుకు ఒక సూపర్‌ వైజర్‌ను నియ మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలహావిూ ల్లో భాగంగా మద్యం నిర్వహణ ప్రభుత్వమే చేపట్టి విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే మొదటి సంవత్సరం 20శాతం మద్యం దుకాణాలను ఎత్తివేస్తుంది. దశలవారీగా షాపులను మరింతగా తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వమే ప్రకటిస్తోంది.