పడాల జలెంధర్ ఆధ్వర్యంలో 50 మంది యూత్ సభ్యులు టిఆర్ఎస్ లో చేరిక

ధర్మపురి నవంబర్ 8 ( జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రం నుండి టౌన్ ప్రెసిడెంట్ పడాల జలెంధర్ ఆధ్వర్యంలో 50 మంది యూత్ సభ్యులు మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువ కప్పి స్వాగతించారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
బడుగు బలహీనవర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, ఈ సందర్భంగా మంత్రి కొప్పుల పార్టీలో చేరిన వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, రాకేష్, కోమల్ల జలెంధర్, చెవులమద్ది శ్రీనివాస్, తాండ్ర కిరణ్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.