పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే.

భువనగిరి టౌన్ (జనం సాక్షి);– కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది , 9 సంవత్సరాలు గడిచిన ఎన్నికల ముందు
ఎన్నడూ అభివృద్ధిపై స్పందించని పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఎన్నికలు రాగానే ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు దండుకునేందుకు డబల్ బెడ్ రూమ్ లోని, గృహ లక్ష్మీ పథకం అని అర్హులైన వారికి కాకుండా టిఆర్ఎస్ పార్టీ వాళ్లకే కేటాయించి ప్రజలని మరోసారి మోసం చేయాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా వ్యతిరేక టిఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగాడుతూ నిరసన తెలుపడం జరిగింది, ప్రజాస్వామ్య భారతదేశంలో నిరసన శాంతియుతంగా తెలుపుతున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.