పదేళ్ల బాలుడుని చితగ్గొట్టిన మేనమామ
రైసిన్ (మధ్యప్రదేశ్), సెప్టెంబర్ 21 : పదేళ్ల బాలుడుని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టిన అమానుషమైన సంఘటన మధ్యప్రదేశ్లోని రైసిన్లో జరిగింది. ఆ బాలుడుని కొట్టింది మరెవరోకాదు… సొంత మేనమామ బ్రజేష్ యాదవ్ అని తెలిసింది. ఇంట్లో డబ్బులు దొంగిలించి, బడికి వెళ్లకుండా తిరుగుతున్నాడంటూ ఆయన ఈ శిక్ష అమలు చేశారు. బాలుడు తాను దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా మేనమామ చితగ్గొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడుని విడిపించి బ్రజేష్యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు.