పద్మ అవార్డులను అందజేచేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌ , పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఒలింపిక్‌ మెడల్స్‌ విజేతలు యోగేశ్వర్‌దత్‌, విజయకుమార్‌లతో పాటు నటుడు నానాపటేకర్‌, పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌…. తదితరులున్నారు. దివంగత నటుడు రాజేశ్‌ఖన్నాకు లభించిన అవార్డును ఆయన సతీమణి డింపుల్‌ కపాడియా స్వీకరించారు.