పనామా పేపర్లలో అజయ్ దేవగణ్ పేరు
ముంబై,మే4(జనంసాక్షి): సనామా పేపర్స్ మరో బాలీవుడ్ జంట పేరును బయటపెట్టింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్కు విదేశీ అకౌంట్లున్నాయి. బ్రిటీష్ వర్జిన్ దీవులకు చెందిన మేర్లీబోన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో అజయ్ వెయ్యి షేర్లను కొన్నట్లు పనామా పత్రాల ద్వారా వెల్లడైంది. ఓ ఇంగ్లీష్ పత్రిక ఆ నివేదికను విడుదల చేసింది. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, ఐశ్వర్యరాయ్లకు కూడా విదేశీ అకౌంట్లున్న
విషయం తెలిసిందే. అజయ్ పెట్టుబడి పెట్టిన మేర్లీబోన్ కంపెనీకి మోసాక్ ఫొనెస్కా రిజిస్టర్ ఏజెంట్గా ఉంది. నైసా యుగ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పేరుతో అజయ్ విదేశీ కంపెనీ షేర్లను కొన్నారు. ఆ కంపెనీలో ఆయన భార్య కాజోల్ కూడా భాగస్వామి. 2013లో ఆ కంపెనీకి అజయ్ డైరక్టర్గా ఉన్నారు. ఆతర్వాత 2014లో రిటైరయ్యారు. అయితే ఆర్బీఐ నియమావళి ప్రకారమే విదేశీ పెట్టుబడులు పెట్టినట్లు అజయ్ స్పష్టం చేశారు.